Team India Captain Jasprit Bumrah | కరోనా మహమ్మారి వెతలు టీమ్ ఇండియా వెంటాడుతున్నాయి. టీం ఇండియా సారధి రోహిత్ శర్మకు కరోనా సోకడంతో ఇంగ్లండ్తో జరిగే ఐదో టెస్ట్ మ్యాచ్కు జట్టు సారధిగా జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా గురువారం ప్రకటించింది.
శుక్రవారం నుంచి ఎడ్గాబస్టన్లో ఇంగ్లండ్తో ఐదో టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా తల పడనున్నది. ఈ నేపథ్యంలో టీం ఇండియా జట్టు సభ్యుల జాబితాలో రోహిత్ శర్మ పేర్ మిస్ అయింది. దీంతో జస్ప్రీత్ బుమ్రాను సారధిగా ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది. వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను నియమిస్తున్నట్లు వెల్లడించింది.
టీం ఇండియా సారధి రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంగ్లండ్తో జరిగే టెస్ట్ మ్యాచ్కు ఎంపిక చేయలేదని బీసీసీఐ తెలిపింది. గురువారం నిర్వహించిన టెస్ట్లో కొవిడ్-19 పాజిటివ్ అని వచ్చింది. దీంతో రోహిత్ శర్మను బీసీసీఐ పక్కన బెట్టింది. జస్ప్రీత్ బుమ్రాను సారధిగా, రిషబ్ పంత్ను డిప్యూటీగా అఖిల భారత సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.