కోల్కతా: ఇటీవల కాలంలో దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న జమ్మూకశ్మీర్కు రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరే అరుదైన అవకాశం లభించింది. బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో సెమీస్లో ఆ జట్టు గెలుపు ముంగిట నిలిచింది. ఆ జట్టు పేసర్ అకిబ్ నబీ ఆల్రౌండ్ షో తో బెంగాల్ బేజారైంది. ఆట మూడో రోజు 198/5తో తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన జమ్మూకశ్మీర్.. షమీ (8/90) ఫస్ట్క్లాస్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆ జట్టు 302 రన్స్కు ఆలౌటైంది.
231కే 8 వికెట్లు కోల్పోయిన దశలో నబీ (42), యుధ్వీర్ (33) పోరాటంతో కశ్మీర్కు స్వల్ప ఆధిక్యం (26) మాత్రమే దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో నబీ (4/36), సునీల్ కుమార్ (4/27) బెంబేలెత్తించడంతో బెంగాల్ 99 రన్స్కే కుప్పకూలింది. 126 పరుగుల స్వల్ప ఛేదనలో కశ్మీర్.. 2 వికెట్లు నష్టపోయి 43 పరుగులు చేసింది.