న్యూఢిల్లీ, ఆగస్టు 3: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. రూపాయి బలోపేతం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.900 తగ్గి రూ.1.48 లక్షల దిగువకు రూ.1,47,400కి పడిపోయింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతకుముందు ఇది రూ.1,48, 300గా ఉన్నది. పసిడితోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో కిలో వెండి రూ.1,800 దిగి రూ.2,26, 500గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, వెండిలకు డిమాండ్ పడిపోవడంతోపాటు డాలర్తో పోలిస్తే రూపాయి బలోపేతం కావడం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీల వైపు మళ్లించడంతో వీటి ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,048.89 డాలర్లు పలుకగా, వెండి 57.97 డాలర్ల వద్ద ఉన్నది.