Shreyas Iyer : భారత స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) రంజీల్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ సిరీస్ (England Series)లో వరుసగా విఫలమై జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్ అయ్యర్.. రంజీ సెమీఫైనల్లో నిరాశ పరుస్తూ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. ముంబై వేదికగా తమిళనాడుతో జరుగుతున్న సెమీఫైనల్లో రెండో రోజు ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. 8 బంతుల్లో 3 రన్స్ చేశాడు. అనంతరం వారియర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.
సాయి కిశోర్ విజృంభణతో కెప్టెన్ అజింక్యా రహానే(19) మోహిత్ అవస్థి(2), శామ్స్ ములానీ(0)లు స్వల్ప స్కోర్కే ఔటయ్యారు. హార్దిక్ తమొరె(8 నాటౌట్), శార్ధూల్ ఠాకూర్(8 నాఔట్)లు ముంబైని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో, ముంబై జట్టు లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్లో ఇంకా 21 పరుగులు వెనకబడి ఉంది.
Musheer Khan reaches his 5⃣0⃣ 👏
A resilient knock so far, leading Mumbai’s fightback 🙌@IDFCFIRSTBank | #RanjiTrophy | #MUMvTN | #SF2
Scorecard ▶️ https://t.co/9tosMLk9TT pic.twitter.com/oVNr4TDWP0
— BCCI Domestic (@BCCIdomestic) March 3, 2024
తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు జట్టును ముంబై పేసర్లు హడలెత్తించారు. తుషార్ దేశ్పాండే మూడు, శార్ధూల్ ఠాకూర్ 2 వికెట్లు తీయడంతో 146 పరుగులకు తమిళనాడు ఆలౌటయ్యింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ పృథ్వీ షా(5), భూపేన్ లల్వానీ(15)లు నిరాశపరిచగా.. అండర్ -19 వరల్డ్ కప్ హీరో ముషీర్ ఖాన్ (55) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కానీ, తమిళానాడు పేసర్ సాయి కిషోర్ ఐదు వికెట్లతో ముంబై నడ్డివిరిచాడు. దాంతో, లంచ్ సమయానికి ముంబై జట్టు 7 వికెట్ల నష్టానికి 125 రన్స్ చేయగలిగింది.