Bajrang Punia: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగివ్వడంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ నిర్ణయం పూర్తిగా అతడి వ్యక్తిగతమని, డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు మాత్రం పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయని స్పష్టం చేసింది. బజరంగ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది. సంజయ్ సింగ్.. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు అత్యంత సన్నిహితుడని, వ్యాపార భాగస్వామి అని ఆరోపిస్తూ సాక్షి మాలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించగా గురువారం బజరంగ్.. ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.
బజరంగ్ పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చిన తర్వాత కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు పీటీఐతో స్పందిస్తూ… ‘అది బజరంగ్ పునియా వ్యక్తిగత నిర్ణయం. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. బజరంగ్ తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని మేం అతడిని కోరుతున్నాం..’ అని తెలిపాడు.
This video of Bajrang Punia keeping his Padma Shri Award outside PM’s residence, is going to break every Indian’s heart except Sanghis. pic.twitter.com/vs6NZiVM8V
— Nimo Tai (@Cryptic_Miind) December 22, 2023
శుక్రవారం బజరంగ్.. పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు గాను ఢిల్లీలోని కర్తవ్యపథ్కు చేరుకున్నాడు. కానీ పోలీసులు ముందుగా అపాయింట్మెంట్ లేదని అతడిని అడ్డుకున్నారు. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్తో పాటు అంతర్జాతీయ వేదికలలో పతకాలు కొల్లగొట్టిన బజరంగ్.. 2021లో టోక్యోలో ముగిసిన ఒలింపిక్స్ – 2023లో 65 కిలోల విభాగంలో కాంస్యం నెగ్గాడు. 2019లో కేంద్ర ప్రభుత్వం అతడిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.