INDvsAFG: అఫ్గానిస్తాన్తో బుధవారం రాత్రి అత్యంత ఉత్కంఠ మధ్య ముగిసిన మూడో టీ20లో భారత్.. డబుల్ సూపర్ ఓవర్లో విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అటు మెయిన్ మ్యాచ్తో పాటు రెండు సూపర్ ఓవర్స్లలోనూ అద్భుతంగా ఆడాడు. తొలి సూపర్ ఓవర్ ఆఖరి బంతికి క్రీజు నుంచి వెనుదిరిగిన (రిటైర్డ్ అవుట్) రోహిత్.. రింకూ సింగ్ను పిలిచాడు. మ్యాచ్ ముగిశాక ఈ నిర్ణయంపై టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రశంసలు కురిపించాడు. భారత సీనియర్ స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ లెవల్లో రోహిత్ ఆలోచించాడని అన్నాడు.
మ్యాచ్ అనంతరం ద్రావిడ్ మాట్లాడుతూ.. ‘అది ఆష్ (అశ్విన్) లెవల్ థింకింగ్. తనను తాను ఔట్ ప్రకటించుకుని పెవిలియన్ చేరాడు. రోహిత్ నాన్ స్ట్రయికర్ ఎండ్ నుంచి నడుచుకుంటూ పెవిలియన్కు వస్తుంటే అసలు అతడు రిటైర్డ్ హర్ట్గా అవుట్ అయ్యాడా..? లేక రిటైర్డ్ అవుటా..? అన్నది ఎవరికీ క్లారిటీ లేదు…’ అని అన్నాడు.
Captain Rohit Sharma, Rahul Dravid and players talking about two Super Overs winning the match yesterday.
– A blockbuster game…!!!! 🔥pic.twitter.com/GsA4Ed3x4k
— CricketMAN2 (@ImTanujSingh) January 18, 2024
రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ – 2023లో కూడా రోహిత్ మాదిరిగానే రిటైర్డ్ అవుట్ అయిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఆ మ్యాచ్లో అశ్విన్.. 19వ ఓవర్ ప్రారంభానికి ముందు అశ్విన్ రిటైర్డ్ అవుట్ అయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తద్వారా ఐపీఎల్లో అలా అవుట్ అయిన తొలి బ్యాటర్గా నిలిచాడు. వాస్తవానికి ఐసీసీ నిబంధనల ప్రకారం.. సూపర్ ఓవర్లో ఔట్ అయిన ఒక బ్యాటర్.. మళ్లీ సూపర్ ఓవర్ ఆడేందుకు అనుమతి లేదు. కానీ ప్రత్యర్థి జట్టు సారథి గానీ కోచ్కు గానీ ఎలాంటి అభ్యంతరం చెప్పకుంటే సదరు ఆటగాళ్లు రెండో సూపర్ ఓవర్లోనూ బ్యాటింగ్, బౌలింగ్కు రావొచ్చు.