హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. సికింద్రాబాద్(Secunderabad) పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు( Padma Rao Goud) మద్దతుగా సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్పేట డివిజన్లో ఇంటింటి ప్రచారం మంగళహారతులు, పూలమాలలు, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కేంద్ర మంత్రిగా ఉండి ప్రజలకు ఏం మేలు చేశారని కిషన్ రెడ్డికి ఓటేయాలని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా అధికారంలో ఉండి సికింద్రాబాద్కు చేసింది ఏమీలేదన్నారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పజ్జన్న గెలుపు ఖాయమని సికింద్రాబాద్ ప్రజలంతా డిసైడ్ అయ్యారని పేర్కొన్నారు.