కల్లాల్లో. కేంద్రాల్లో తడిసిన ధాన్యపు రాశులు
ఆత్మకూరు(ఎం)లో పిడుగుపాటుకు
11 గొర్రెలు, 6 మేకలు, రెండు గేదెలు మృతి
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్12: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. మండలంలోని తిమ్మాపురంలో పిడుగుపాటుకు కొసన యాదయ్యకు చెందిన 11 గొర్రెలు, పల్లెర్లలో దనబోయిన పర్వతాలుకు చెందిన 6 మేకలు, 2 గేదె మృతి చెందాయి. కల్లాల వద్ద ధాన్యం రాసులు తడిచాయి.
గుండాల: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఉరు ములతో కూడిన వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసింది. అకాల వర్షంతో రైతులు నానా అవస్ధలు పడుతూ రాశులపై టార్ఫాలిన్లు కప్పు కున్నప్పటికీ ధాన్యం తడిసి ముద్దయింది.
చౌటుప్పల్: చౌటుప్పల్లో సోమవారం సాయంత్రం ఉరుము లు , మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. అక స్మాతుగా కురిసిన వర్షానికి చౌటుప్పల్ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిచి ముద్దయ్యింది. వర్షం వెలిశాక ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
రామన్నపేట: మండల వ్యాప్తంగా సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మార్కెట్ కు ధాన్యం తీసుకువచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. రైతులు కొనుగోలు కేంద్రాలలో ఆర బెట్టిన ధాన్యం తడిసింది. రాశుల పై కప్పిన పట్టాలు గాలికి లేచిపోవడంతో ధాన్యం తడిసింది.
అడ్డగూడూరు: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న దాన్యం రాశులు వర్షానికి తడిసి ముద్దయ్యాయి.
వలిగొండ: మండల వ్యాప్తంగా సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.