INDWvsAUSW: సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్లో భారత మహిళల జట్టు మరోసారి విఫలమైంది. వికెట్ కీపర్ రిచా ఘోష్ (28 బంతుల్లో 34, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), స్మృతి మంధాన (28 బంతుల్లో 29, 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో ఆసీస్ ముందు భారత్ ఓ మోస్తారు టార్గెట్ను ఉంచగలిగింది. డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన భారత్.. ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్, వర్హెమ్ తలా రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు శుభారంభమే అందించారు. ఓపెనర్లు షఫాలీ వర్మ (17 బంతుల్లో 26, 6 ఫోర్లు), స్మృతి మంధానలు తొలి వికెట్కు 39 పరుగులు జోడించారు. ధాటిగా ఆడుతున్న షఫాలీని.. మేగన్ షట్ నాలుగో ఓవర్లో పెవిలియన్ చేర్చింది. వన్ డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (2), హర్మన్ప్రీత్ కౌర్ (3) కూడా విఫలమయ్యారు. మంధాన సైతం వర్హెమ్ బౌలింగ్లో గార్డ్నర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.
Innings Break!
An entertaining knock from @13richaghosh powers #TeamIndia to 147/6 👌👌
Second innings coming up shortly!
Scorecard ▶️ https://t.co/nsPC3lefeg#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/G3JJa4Fqr0
— BCCI Women (@BCCIWomen) January 9, 2024
మంధాన నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్.. భారత స్కోరును ముందుకు నడిపించింది. దీప్తి శర్మ (14) తో కలిసి రిచా.. 33 పరుగులు జోడించింది. దీప్తి శర్మ ఔట్ అయినా ఆఖర్లో అమన్జ్యోత్ కౌర్ (14 బంతుల్లో 17 నాటౌట్, 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్, ఆసీస్లు తలా ఓ మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ విజేతగా నిలువనుంది.