హైదరాబాద్ : రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్(BRS graph) పెరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు. మల్కాజ్గిరి(Malkajigiri) బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి పార్లమెంట్ 38 శాతం, క్యాంటన్మెంట్లో 42 శాతం, బీజేపీ 28, కాంగ్రెస్ పార్టీకి 27 శాతమే గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు. స్థానిక అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవరు అడ్డుకోలేరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే లక్ష్మారెడ్డిని గెలిపిస్తాయన్నారు.
రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది
లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్ గిరి పార్లమెంట్ 38 శాతం, క్యాంటన్మెంట్లో 42 శాతం ఉంది, బీజేపీ 28, కాంగ్రెస్ పార్టీకి 27 శాతమే ఉంది – ఎమ్మెల్యే మల్లారెడ్డి pic.twitter.com/mi0oN4p4wv
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024