INDvsSA 1st Test: భారత్-దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా భారత్ను 245 పరుగులకే ఆలౌట్ చేసిన సఫారీలు.. లంచ్ సమయానికల్లా 16 ఓవర్లు ముగిసేటప్పటికీ ఒక వికెట్ కోల్పోయి 49 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఎయిడెన్ మార్క్రమ్ వికెట్ కోల్పోయినా మాజీ సారథి డీన్ ఎల్గర్ (29 బ్యాటింగ్), టోని డి జోర్జి (12 బ్యాటింగ్)లు భారత పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటున్నారు.
తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన సఫారీలకు నాలుగో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్గా వచ్చిన మార్క్రమ్.. 17 బంతులాడి ఒక బౌండరీ సాయంతో ఐదు పరుగులు చేశాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఐదో బంతిని వికెట్ కీపర్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ తర్వాత వచ్చిన జోర్జి.. మరో వికెట్ కోల్పోకుండా ఆడుతున్నాడు. బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణతో పాటు శార్దూల్ ఠాకూర్, అశ్విన్లు బౌలింగ్ చేసినా సఫారీలు నిలకడగా ఆడుతున్నారు.
South Africa go through to Lunch having lost only one wicket after a fascinating passage of play 🔥
📝 #SAvIND: https://t.co/REqMWoHhqd | #WTC25 pic.twitter.com/H27j2fd5pq
— ICC (@ICC) December 27, 2023
అంతకుముందు రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. కెఎల్ రాహుల్ (101) సెంచరీ చేయగా కోహ్లీ (38), శ్రేయస్ అయ్యర్ (31) ఫర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో రబాడ ఐదు వికెట్లు తీయగా బర్గర్ మూడు వికెట్లు తీశాడు.