INDvsNZ: వన్డే ప్రపంచకప్ ప్రసారదారుగా ఉన్న స్టార్ స్పోర్ట్స్పై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెమీఫైనల్స్కు ముందు స్టార్ స్పోర్ట్స్ మరోసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్కు తెరలేపడమే ఇందుకు కారణం. కీలక సెమీస్కు ముందు స్టార్ స్పోర్ట్స్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రివ్యూకు సంబంధించిన ఓ పోస్టర్ను రిలీజ్ చేస్తూ భారత సారథి స్థానంలో రోహిత్ శర్మకు బదులు విరాట్ కోహ్లీ ఫోటోను పెట్టింది. ఇదే వివాదానికి దారితీసింది. దీనిపై రోహిత్ ఫ్యాన్స్తో పాటు టీమిండియా అభిమానులూ భగ్గుమన్నారు.
బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలుకాబోయే ఈ మ్యాచ్కు ప్రివ్యూ పోస్టర్ను రిలీజ్ చేస్తూ స్టార్ స్పోర్ట్స్ చేసిన ఈ ట్వీట్.. అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. స్టార్ స్పోర్ట్స్ కోహ్లీ భజన చేసుకుంటే తమకు పోయేదేమీ లేదని, కానీ కెప్టెన్ నే మారిస్తే ఎలా..? అని వాపోతున్నారు. రోహిత్ ఫ్యాన్స్ అయితే స్టార్ను ఆటాడుకున్నారు. ఎంత కోహ్లీ మీద ప్రేమ ఉన్నా జట్టు సారథిని మార్చడం సరికాదని తప్పుబట్టారు. అభిమానుల దెబ్బకు స్టార్ పోస్టర్ను మార్చేసింది. కోహ్లీ స్థానంలో రోహిత్ ఫోటోను పెట్టి కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
Never mess with Karma & Rohit Sharma.
We owned Kohli & Star Sports.Action Reaction pic.twitter.com/mFn2VX8mTD
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 𝕏 (@ImHydro45) November 14, 2023
So called Face of cricket is removed from star sports promo.🤣🤣🤣🤣 pic.twitter.com/06Q832io4H
— Sir Dinda⁴⁵ (@FuriousDinda) November 14, 2023
Well done, Star Sports!
If you will respect the Indian cricket, Indian cricket fans will respect you.
I hope to see good coverage during semi-finals and final — without any biased and hero-worship pic.twitter.com/heTwLtPvI2
— Madhav Sharma (@HashTagCricket) November 14, 2023