నార్నూర్, మే 5 : రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు ఖాయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం గాదిగూడ మండలంలో పార్టీ శ్రేణులతో విస్తృతంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ గడప గడపకూ ప్రచా రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆడ చంద్రకళ, వైస్ ఎంపీపీ యోగేశ్, నార్నూర్, గాదిగూడ మండలాధ్యక్షులు పుసంబాధిరావ్, మెస్రం హన్మంత్రావ్, నార్నూర్ వైస్ ఎంపీ పీ జాదవ్ చంద్రశేఖర్, ఆత్రం వామన్, విష్ణుఫడ్, సయ్యద్ ఖాసీం పాల్గొన్నారు.