India’s T20I Squad | కరేబియన్ దీవుల్లో వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీస్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఐదుమ్యాచ్ల సిరీస్ కోసం బుధవారం జట్టును ఎంపిక చేసింది. వెస్టిండీస్లో భారత్ ఐదు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆగస్టు 3 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్న ఈ సిరీస్కు భారత జట్టులో కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లను దూరం పెట్టిన సెలక్షన్ కమిటీ.. వెస్టిండీస్తో సిరీస్కు యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
ఈ సిరీస్కు సీనియర్లను ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలు రాగా.. సెలక్షన్ కమిటీ సిరీస్లో యువ ఆటగాళ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబయి తరఫున బరిలోకి దిగిన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు పిలుపువచ్చింది. కెరీర్లో తొలిసారిగా అంతర్జాతీయ జట్టులో తరఫున బరిలోకి దిగనున్నాడు. అలాగే గత ఐపీఎల్ సీజన్లో రాణించిన యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్, ముకేశ్ కుమార్లకు సైతం వెస్టిండిస్తో జరిగే టీ20 సిరీస్కు ఎంపిక చేసింది.
లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సైతం జట్టులోకి తీసుకున్నది. మరో వైపు వెస్టిండీస్ పర్యటనలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతిని ఇచ్చింది. ఐపీఎల్-2023లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ జితేశ్ శర్మ విఫలమయ్యాడు. పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులపడుతున్న జితేష్ శర్మ, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావిని జట్టు నుంచి తప్పించింది. వారి స్థానంలో కొత్తగా యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తీసుకుంది.
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
1వ టీ20: బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్, ఆగస్టు 3
2వ టీ20: ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా, ఆగస్టు 6
3వ టీ20: ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా, ఆగస్టు 8
4వ T20: సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం, లాడర్హిల్, ఫ్లోరిడా, ఆగస్టు 12
5వ T20: సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం, లాడర్హిల్, ఫ్లోరిడా, ఆగస్టు 13