HS Prannoy : భారత్ స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు హెచ్హెస్ ప్రణయ్(HS Prannoy) సంచలనం సృష్టించాడు. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టైటిల్ సాధించాడు. దాంతో తొలి వరల్డ్ టూర్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన అతను ఫైనల్లోనూ సత్తా చాటాడు. వెంగ్ హాంగ్ యాంగ్(చైనా)ను వరుస సెట్లలో 21-19, 13-21, 21-18తో ఓడించాడు. ట్రోఫీతో పాటు రూ. 25 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఈ ఏడాది అతడికి ఇదే తొలి ఏటీపీ టైటిల్ కావడం విశేషం. గత ఏడాది స్విస్ పెన్లో ప్రణయ్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు.
ఫామ్లో ఉన్న ప్రణయ్ సెమీఫైనల్లో క్రిస్టియన్ ఆదినాథ(ఇండేనేషియా)తో తలపడ్డాడు. క్రిస్టియన్ మోకాలి గాయంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. 19-17 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న సమయంలో అతడు గాయపడ్డాడు. మ్యాచ్ మధ్యలో జంప్ చేసి వెనక్కి తిరుగుతుండగా మోకాలి నొప్పితో విలవిలలాడాడు. ఆట కొనసాగించేందుకు అతను సిద్ధంగా లేకపోవడంతో అడిని వీల్ చైర్ సాయంతో కోర్టు బయటకు తీసుకెళ్లారు. దాంతో నిర్వాహకులు ప్రణయ్ని విజేతగా ప్రకటించారు.
ఎన్నో అంచనాలతో మలేషియా మాస్టర్స్లో బరిలోకి దిగిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu), తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ నిరాశపరిచారు. మహిళల సింగిల్స్లో పతకంపై ఆశలు రేపిన సింధు సెమీఫైనల్లో ఓటమితో ఇంటిదారి పట్టింది. జార్జియా మరిస్కా తుంజంగ్(ఇండోనేషియా) చేతిలో 14-21,17-21తో ఆమె ఓటమిపాలైంది. శ్రీకాంత్ అయితే.. క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.