అహ్మదాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రస్తుత కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni)కి ఇవాళ్టి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ 250వ ఐపీఎల్ మ్యాచ్. ఈ మ్యాచ్తో ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా ధోనీకి గుర్తింపు దక్కనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ధోనీని పొగిడేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ ట్విటర్లో పలు ఫొటోలను షేర్ చేసింది.
ముందుగా ‘మై డియర్ థాలా’ అనే క్యాప్షన్ ఇస్తూ ధోనీకి సంబంధించిన నాలుగు ఫొటోలను షేర్ చేసింది. ఆ తర్వాత ‘ఎవ్రీ టైమ్ యూ స్టెప్డ్ ఆన్ టూ ఫీల్డ్, యూ గేవ్ అజ్ బట్టర్ఫ్లైస్’ అని పేర్కొంటూ మరో నాలుగు ఫొటోలను ట్విటర్లో పంచుకుంది. అదేవిధంగా #Thala250 #WhistlePodu #Yellove అనే హ్యాష్ ట్యాగ్లతో మరో రెండు ఫొటోలను షేర్ చేసింది.
Every time you stepped on to the field, you gave us butterflies 🦋 pic.twitter.com/qMNXMR5IsS
— Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023
#Thala250 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/jKuxwLvYtl
— Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023