Indonesia Open : ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్రాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty) జోడీ అదరగొట్టింది. సంచలన ఆటతో ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్లో కాంగ్ మిన్ హయుక్ – సియో సియెంగ్ జే జోడీపై సాత్విక్ – చిరాగ్ అద్భుత విజయం సాధించారు. హోరాహోరీ పోరులో17-21, 21-19, 21-18తో గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించారు. దాంతో, సూపర్ 1000 టోర్నమెంట్ ఫైనల్కు చేరిన మొదటి భారత జోడీగా రికార్డు సృష్టించారు.
టోర్నీ ఆరంభం నుంచి దుమ్మురేపుతున్న సాత్విక్ – చిరాగ్ జోడీ సెమీస్లో టాప్ డ్స్కు షాకిచ్చింది. ఫజర్ అల్ఫియన్, ముహహ్మద్ రియాన్ అర్డియాంటోపై అద్భుత విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్(HS Pranay) ఈరోజు సెమీఫైనల్లో తలపడనున్నాడు. మరో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) క్వార్టర్స్లోనే ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. మహిళల సింగిల్స్లో పతకం తెస్తుందనుకున్న పీవీ సింధు(PV Sindhu) రెండో రౌండ్ దాటలేకపోయింది.