క్వీన్స్టౌన్: వచ్చే నెలలో జరుగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో నేడు ఏకైక టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నది. దాదాపు నెలన్నర ముందే మెగాటోర్నీ జరుగనున్న న్యూజిలాండ్లో అడుగుపెట్టిన మహిళల బృందం.. క్రైస్ట్చర్చ్లో పది రోజుల క్వారంటైన్ ముగించుకొని గురువారం బరిలోకి దిగనుంది. ఇరు జట్ల మధ్య నేడు ఏకైక టీ20 మ్యాచ్ జరుగనుండగా.. శనివారం నుంచి ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే జట్టుకు మిథాలీ రాజ్, పొట్టి ఫార్మాట్కు హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తున్నారు. బిగ్బాష్ లీగ్లో రాణించిన అనంతరం భారత స్టార్ ప్లేయర్లకు సరైన ప్రాక్టీస్ లేకపోగా.. ప్రపంచకప్నకు ముందు ఈ సిరీస్ బాగా ఉపయోగపడనుంది. స్మృతి మంధన, షఫాలీ వర్మ, హర్మన్ప్రీత్, దీప్తి, పూనమ్ రాణిస్తే భారత్కు తిరుగుండదు.