World Archery Championships : భారత మహిళా ఆర్చర్లు(Indian Women Archers) వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్స్(World Archery Championships 2023)లో చరిత్ర సృష్టించారు. బెర్లిన్లో జరుగుతున్న ఈ పోటీల్లో గోల్డ్ మెడల్(Gold Medal) సాధించారు. ఈ పోటీల్లో ఏ కేటగిరీలోనైనా బంగారు పతకం గెలిచిన మొదటి భారత ఆర్చర్లుగా రికార్డుల్లోకి ఎక్కారు. జ్యోతి సురేఖ వెన్నం(Jyothi Surekha Vennam), పర్నీత్ కౌర్(Parneet Kaur), అదితీ గోపించంద్ స్వామి(Aditi Gopichand Swami)తో కూడిన మహిళల కాంపౌండ్ ఆర్చరీ బృందం ఫైనల్లో మెక్సికో ఆర్చర్లను ఓడించింది.
ఫైనల్ రౌండ్లో గురి తప్పకుండా బాణం విసిరిన ఈ ముగ్గురు 235-229తో విజేతగా నిలిచారు. అనంతరం పోడియంపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ‘మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ పోటీల్లో భారతదేశానికి మొదటి పతకం అందించాం. టోర్నీ ఆరంభం నుంచి ఫైనల్ ఫైట్ వరకూ మేము ఆటపైనే ఎక్కువ దృష్టి పెట్టాం. కచ్చితంగా పసిడి పతకం గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగాం’ అని అదితీ తెలిపింది.
HISTORIC win for India 🇮🇳🥇
New world champions at the Hyundai @worldarchery Championships.#WorldArchery pic.twitter.com/8dNHLZJkCR— World Archery (@worldarchery) August 4, 2023
భారత మహిళా ఆర్చర్లకు మొదటి రౌండ్లోనే బై లభించింది. ఆ తర్వాతి రౌండ్లో జ్యోతి సురేఖ, పర్నీత్, అదితీలు చైనీస్ తైపీ, టర్కీకి చెందిన ఆర్చర్లను ఓడించి క్వార్టర్స్లో అడుగు పెట్టారు. అయితే.. సెమీస్లో వీళ్లకు డిఫెండింగ్ చాంపియన్ కొలంబియా జట్టుతో గట్టి పోటీ ఎదురైంది.
జ్యోతి సురేఖ, పర్నీత్, అదితీ
హోరాహోరీగా జరిగిన ఆ పోటీలో భారత ఆర్చర్లు 220-216తో అద్భుత విజయం సాధించారు. ఫైనల్లో కూడా ఈ ముగ్గురు జోరు కొనసాగించి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ టోర్నీనుంచి భారత పురుషుల జట్టు ఓటమితో నిష్క్రమించిన విషయం తెలిసిందే. దాంతో, వచ్చే ఏడాది పారిస్ ఆతిథ్యం ఇస్తున్న ఒలింపిక్స్(Paris Olympics 2024) పోటీలకు అర్హత సాధించలేకపోయింది.