IND – WI : భారత్(Team India), వెస్టిండీస్(West Indies) జట్లకు ఐసీసీ(ICC) షాకిచ్చింది. తొలి టీ20లో స్లో ఓవర్ రేటు(Slow Over Rate) కారణంగా రెండు టీమ్లకు జరిమానా విధించింది. బ్రియాన్ లారా స్టేడియం (Brian Lara Stadium)లో నిన్న జరిగిన మొదటి టీ20లో టీమిండియా, విండీస్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయాయి. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్(Richie Richardson) ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాదు భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya), విండీస్ సారథి రొవ్మన్ పావెల్(Rovman Powell) తమ తప్పును అంగీకరించారు.
దాంతో, ఒక్క ఓవర్ ఆలస్యంగా వేసిన భారత్కు మ్యాచ్ ఫీజులో 5 శాతం, రెండు ఓవర్లు ఆలస్యంగా వేసిన కరీబియన్ జట్టుకు 10 శాతం కోత పడింది. నిన్నటి విజయంతో ఆతిథ్య విండీస్ ఐదు టీ20ల సిరీస్లో1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
India and West Indies have pleaded guilty and accepted the proposed sanctions 👇
— ICC (@ICC) August 4, 2023
వన్డే సిరీస్లో దుమ్మురేపిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు టీ20 సిరీస్ను ఓటమితో ఆరంభించింది. టాస్ గెలిచి మొదట ఆడిన విండీస్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్ పావెల్(48), నికోలస్ పూరన్(41) దంచి కొట్టారు. 150 టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన భారత్ అనూహ్యంగా 4 పరగులు తేడాతో ఓడిపోయింది.
తిలక్ వర్మ(39)
తిలక్ వర్మ(39) అరంగేట్రంలోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్(21), సంజూ శాంసన్(12) తీవ్రంగా నిరాశపరిచారు. అయితే.. ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా.. షెపర్డ్ కేవలం 6 రన్స్ ఇచ్చాడంతో. దాంతో, పావెల్ సేన విజయం సాధించింది. రెండో టీ20 గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఆగస్టు 6న జరుగనుంది.