కౌలాలంపూర్: గాయం కారణంగా ఆరు నెలలుగా ఆటకు దూరమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగనుంది. ఈ సీజన ఆరంభ టోర్నీలో సింధుతో పాటు సైనా నెహ్వాల్, ఆకర్షి కశ్యప్, మాళవిక పోటీలో ఉండగా.. పురుషుల విభాగం నుంచి కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ బరిలో దిగుతున్నారు. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత కోర్టుకు దూరమైన సింధు.. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడనుంది. మారిన్తో జరిగిన గత మూడు మ్యాచ్ల్లో ఓడిన సింధు.. అందుకు బదులు తీర్చుకోవాలని చూస్తుంటే.. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.