ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్లో జపాన్కు చెందిన టాప్ సీడెడ్ జోడీ టకురో హోకి, యూగో కోబయాషీపై భారత్ జట్టు విజయం సాధించింది. భారత స్టార్ ప్లేయర్లు సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి ఈ మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం కొనసాగించింది. జపాన్ జోడీపై 23-21, 21-18 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. మొత్తమ్మీద 49 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ఎక్కడా పట్టువదలని రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ.. సెమీస్ చేరుకున్నారు.
అంతకుముందు కూడా రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ అద్భుతంగా ఆడింది. మలేషియన్ జోడీ మాన్ వే చాంగ్, కై వున్ టీపై 21-16, 21-14 తేడాతో వరుస సెట్లు గెలుచుకున్న ఈ జంట.. క్వార్టర్ ఫైనల్స్లో అడుగు పెట్టింది. ఈ మ్యాచ్ నలభై నిమిషాల పాటు జరిగింది.
కాగా, భారత స్టార్ షట్లర్లు ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ ముగ్గురూ మాత్రం ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ విభాగం ప్రి-క్వార్టర్ ఫైనల్స్ మ్యాచుల్లో వీళ్లు ఓటమి చవి చూశారు.
చైనాకు చెందిన లు గాంగ్ జు చేతిలో 19-12, 22-20, 19-21 తేడాతో ప్రణయ్ పరాజయం చవిచూశాడు. థాయ్ల్యాండ్కు చెందిన కున్లావట్ విటిసాన్ చేతిలో 21-18, 21-11 పాయింట్ల తేడాతో సమీర్ ఓటమి పాలయ్యాడు. డెన్మార్క్ ప్లేయర్ రాస్మస్ గెంకేతో జరిగిన మ్యాచ్లో 19-21, 21-12, 21-19 తేడాతో శ్రీకాంత్ కూడా ఓడిపోయాడు. ఈ ఓటములతో వీళ్లు ముగ్గురూ ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ను నుంచి తప్పుకున్నారు.