హోబర్ట్: ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్లో భారత హాకీ జట్టు పరాభవాల పరంపర కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో మొదలైన రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో 3-4 (1-1)తో స్పెయిన్ చేతిలో ఓడింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లూ 1-1తో సమంగా ఉండటంతో షూటౌట్లో తేలిన ఫలితంలో స్పెయిన్ జయకేతనం ఎగురవేసింది.
19వ నిమిషంలోనే మనిందర్ అద్భుత గోల్తో మ్యాచ్ ముగిసేదాకా ఆధిక్యాన్ని కొనసాగించిన భారత్కు ఆట మరో నిమిషంలో ముగుస్తుందనగా బ్రూనో (59వ నిమిషంలో) షాకిచ్చాడు. 9 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఇప్పటికే ఏడు మ్యాచ్లు ఆడి ఒక్కటి కూడా నెగ్గని భారత్ ఐదు ఓడి రెండింటిని డ్రా చేసుకుని రెండు పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.