భారత దేశం 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో.. భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఆగస్టు 22న ఈ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వెళ్లింది.
దీనికి బీసీసీఐ కూడా అంగీకరిస్తే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. మరి బీసీసీఐ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.