T20 cricket : పొట్టి క్రికెట్లో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మిస్సైల్లా దూసుకెళ్తున్నాడు. శ్రీలంకతో మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. అంతేకాదు ఈ ఫార్మాట్లో ఎక్కువ సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న మూడో భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. విరాట్ కోహ్లీ 15 అవార్డులతో ఈ జాబితాలో టాప్లో ఉన్నాడు. రోహిత్ శర్మ (12) రెండో స్థానంలో నిలిచాడు. 10 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో సూర్యకుమార్ యాదవ్ మూడో ప్లేస్ సంపాదించాడు. కోహ్లీ ఇప్పటివరకూ 115 ఇన్నింగ్స్లు, రోహిత్ 148 ఇన్నింగ్స్లు ఆడారు. అయితే.. సూర్య కేవలం 45 ఇన్నింగ్స్ల్లోనే 10 సార్లు ఈ అవార్డు అందుకోవడం విశేషం.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా ఆడిన సూర్య భారత టీ20 జట్టులో చోటు సంపాదించాడు. విధ్యంస ఇన్నింగ్స్ ఆడుతూ రెండేళ్లలోనే కీలకమైన ఆటగాడిగా ఎదిగాడు. పోయిన ఏడాది టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ సిరీస్లో అదరగొట్టి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సాధించాడు. రాజ్కోట్లో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో మెరుపు శతకం సాధించాడు. 45 బంతుల్లోనే మూడంకెల మార్క్ అందుకున్నాడు. అతని సెన్సేషనల్ ఇన్నింగ్స్తో భారత్ 228 పరుగులు చేసింది.
Suryakumar Yadav has not even played half matches than Virat Kohli and Rohit Sharma, but he is nearing them in this list 🔥
Will he end up as India’s best ever T20 batter? 💪#SKY #ViratKohli #RohitSharma pic.twitter.com/3V1Lkim195
— Sportskeeda (@Sportskeeda) January 8, 2023