పుణె: ఇంగ్లండ్కు తొలి దెబ్బ తగిలింది. జోరు మీదున్న జేసన్ రాయ్ (52 బంతుల్లో 55: 7 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ వేసిన బంతిని బెయిర్ స్టో మిడ్ వికెట్ దిశగా ఆడి పరుగు కోసం వెళ్లాడు. అంతలోనే అద్భుత రీతిలో బంతిని అందుకున్న రోహిత్ వికెట్ కీపర్ రిషబ్కు బంతిని త్రో వేశాడు. వెంటనే పంత్ వికెట్లకు గిరాటేయడంతో నాన్ స్ట్రయికర్ ఎండ్ నుంచి వస్తోన్న రాయ్ అవుటయ్యాడు. అంతకుముందు బెయిర్ స్టో 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధసెంచరీ నమోదు చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి