ఉలన్బాతర్ (మంగోలియా) : ఏషియా బాక్సింగ్ చాంపియన్షిప్లో మూడో రోజూ భారత బాక్సర్లు దుమ్మురేపారు. మంగోలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా విశ్వనాథ్ సురేశ్, సచిన్ సివాచ్ క్వార్టర్స్కు దూసుకెళ్లారు.
పురుషుల 50 కిలోల క్యాటగిరీలో విశ్వనాథ్.. 5-0తో కిర్గిస్థాన్ బాక్సర్ బెక్జట్ ఎర్గెషొవ్పై ఏకపక్ష విజయం సాధించి తదుపరి రౌండ్కు ముందంజ వేశాడు. మెన్స్ 60 కిలోల విభాగంలో సచిన్.. 4-1తో బుయండలై బయర్ఖు (మంగోలియా)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు.