టోక్యో: ఒలింపిక్స్లో మరో ఇండియన్ బాక్సర్ ఇంటిదారి పట్టాడు. 69-75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో ఆశిష్ కుమార్ రౌండ్ ఆఫ్ 32 కూడా దాటలేకపోయాడు. సోమవారం చైనా బాక్సర్ ఎర్బీకె తౌహెటా చేతిలో 5-0తో ఓడిపోయాడు. తొలి రెండు రౌండ్లలో ఐదుగురు జడ్జ్లు చైనా బాక్సర్ వైపే మొగ్గు చూపారు. మూడో రౌండ్లో ఆశిష్ కాస్త కోలుకొని పైచేయి సాధించినా విజయం మాత్రం తౌహెటానే వరించింది. ఆశిష్ తన ప్రత్యర్థికి బాగానే పంచ్లు ఇచ్చినా.. చైనా బాక్సర్ టెక్నికల్ గేమ్తో బోల్తా కొట్టించాడు.