తాష్కెంట్: ఆసియా కప్ స్టేజ్-2 వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీలో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. కాంపౌండ్ విభాగంలో తమదైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ మన ఆర్చర్లు 14 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో ఏడు స్వర్ణాలు సహా ఐదు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తానికి మొత్తంగా కాంపౌండ్ విభాగంలో పతకాలన్నీ క్లీన్స్వీప్ చేశారు.
మరోవైపు రికర్వ్ విభాగంలో చైనాతో జరిగిన మూడు వేర్వేరు ఫైనల్స్లో భారత్ ఆర్చర్లు ఓడి రజత పతకాలతో సరిపెట్టుకోగా, రెండు స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. ఆర్చరీ హాట్ ఫెవరేట్ కొరియా గైర్హాజరీలో జరిగిన టోర్నీలో భారత్ పతక జోరు కనబరిచింది. మృణాల్ చౌహాన్, తుషార్ షెల్కె, జయంత తాలుక్దార్తో కూడిన భారత త్రయం 5-1తో చైనా గెలిచి పసిడి సొంతం చేసుకుంది. మిక్స్డ్ ద్వయం చౌహాన్, సంగీత 5-4తో చైనా గెలిచి స్వర్ణం గెలిచారు. కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్ల జోరుకు అడ్డులేకుండా పోయింది.