Axar Patel : ఆసియా కప్(Asia Cup 2023)లో గాయపడిన భారత స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel) ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దాంతో, ఆస్ట్రేలియా(Australia)తో సెప్టెంబర్ 27న జరిగే నామమాత్రమైన మూడో వన్డేకు అతను దూరం కానున్నాడు. ఎడమ కాలి తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అక్షర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దాంతో, రాజ్కోట్లో జరిగే ఆఖరి వన్డేలో అశ్విన్(R Ashwin)నే ఆడించే అవకాశం ఉంది.
సొంత గడ్డపై మరో 10 రోజుల్లో వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ఉంది. ఆలోపు అక్షర్ పటేల్ కోలుకుంటాడా? లేదా? అనేది భారత జట్టును కలవర పరుస్తోంది. అయితే… అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన సినియర్ స్పిన్నర్ అశ్విన్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఇండోర్లో జరిగిన రెండో వన్డేలో అశ్విన్ మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. దాంతో, సెప్టెంబర్ 27న బీసీసీపై ప్రకటించనున్న ప్రపంచ కప్ తుది బృందంలోని 15 మందిలో అతడు ఉండే అవకాశం ఉంది. అయితే.. వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ల వరకూ అక్షర్ ఫిట్నెస్ సాధిస్తాడని సమాచారం.
ఇండోర్లో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 99 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. మూడు వన్డేల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం కంగారూల లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317గానిర్దేశించారు.
That’s that from the 2nd ODI.
Jadeja cleans up Sean Abbott as Australia are all out for 217 runs in in 28.2 overs.#TeamIndia take an unassailable lead of 2-0.#INDvAUS pic.twitter.com/LawVWu2JI8
— BCCI (@BCCI) September 24, 2023
అయితే.. అశ్విన్, జడేజా స్పిన్ మయాతో ఆసీస్ 217 రన్స్కే ఆలౌటయ్యింది. మరో విషయం ఏంటంటే.. శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్కు విశ్రాంతినిచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జట్టుతో కలువనున్నారు. ఇండోర్ మ్యాచ్ ఆడని పేసర్ బుమ్రా కూడా మూడో వన్డేకు రెడీ అవుతున్నాడు.