హోంగ్జూ: భారతీయ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో(Asian Games) తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. హర్మన్ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు.. ఆసియా క్రీడల ఫైనల్లో శ్రీలంకపై 19 రన్స్ తేడాతో నెగ్గింది. దీంతో ఈ యేటి ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలోకి రెండో స్వర్ణ పతకం వెళ్లింది. ఇప్పటి వరకు ఈ క్రీడల్లో ఇండియా మొత్తం 11 పతకాలను కైవసం చేసుకున్నది.
📸📸 We’ve done it! 👏 👏
Congratulations to #TeamIndia as they clinch a Gold 🥇 Medal at the Asian Games! 🙌 🙌
Well done! 🇮🇳
Scorecard ▶️ https://t.co/dY0wBiW3qA#IndiaAtAG22 | #AsianGames pic.twitter.com/Wfnonwlxgh
— BCCI Women (@BCCIWomen) September 25, 2023
తొలుత టాస్ గెలిచిన భారతీయ మహిళల జట్టు.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నది. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. స్మృతి మందానా 46, జెమీమా రోడ్రిగ్స్ 42 రన్స్ చేసి రాణించారు. స్వల్ప టార్గెట్తో బరిలోకి దిగిన లంక మహిళల జట్టును భారత బౌలర్లు దెబ్బతీశారు. లంక మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97 రన్స్ మాత్రమే చేసింది. దీంతో 19 రన్స్ తేడాతో ఇండియా విక్టరీ ఖాయమైంది. భారత బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లు వేసి ఆరు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నది. మరో బౌలర్ రాజేశ్వరీ గౌక్వాడ్ రెండు వికెట్లు తీసుకున్నది.
Indian women’s cricket team wins Gold at the #AsianGames with a dominant win over Sri Lanka, led by 18-year-old sensation #TitasSadhu‘s bowling brilliance (3 for 6). Congratulations to the team and support staff for this historic achievement! 🇮🇳 @BCCIWomen pic.twitter.com/md78olzIxS
— Jay Shah (@JayShah) September 25, 2023