జొహెన్నెస్బర్గ్: మొదటి టెస్టు గెలిచి ఊపు మీదున్న భారత్.. సిరీస్పై కన్నేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వాండరర్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే కెప్టెన్ కోహ్లీ కాకుండా కేఎల్ రాహుల్ టాస్కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రెండో టెస్టు నుంచి కోహ్లీ తప్పుకోవడంతో రాహుల్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగుతున్నది.
భారత్ మొదటి టెస్టులో 113 పరుగులతో ప్రొటీస్పై గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జొహెన్నెస్బర్గ్లో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం ఐదు మ్యాచులు ఆడగా రెండింట గెలిచిన భారత్, మూడు మ్యాచ్లను డ్రా చేసింది. కాగా, కెప్టెన్ కోహ్లీ మినహా భారత జట్టులో పెద్దగా మార్పులేమీ జరగలేదు. కోహ్లీ స్థానంలో తెలుగు ఆటగాడు హనుమ విహారిని జట్టులోకి తీసుకున్నారు.
భారత జట్టు
కేఎల్ రాహూల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.