భారత హాకీ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఎఫ్ఐహెచ్ హాకీ 5ఎస్ ఛాంపియన్షిప్ తొలి సీజన్లో విజేతగా నిలిచింది. ఐదు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో మూడు విజయాలతో లీగ్ దశలో మూడు విజయాలు, ఒక డ్రాతో అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు.. ఒక్క ఓటమి కూడా లేకుండానే టోర్నీని ముగించింది.
ఫైనల్ ఆరంభంలో పోలాండ్ జట్టు జోరుమీద కనిపించింది. వరుసగా మూడు గోల్స్ చేసింది. అప్పటికి భారత్ ఒక్క గోల్ కూడా చెయ్యలేదు. ఆదివారం నాడు భారత జట్టు రెండు మ్యాచులు ఆడగా.. పోలాండ్ అప్పటికి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి ఉంది. దాంతో భారత ఆటగాళ్లు అలసిపోయి ఉండటంతో.. పోలాండ్ జట్టు ఆరంభంలోనే లీడ్ సాధించింది.
అయితే వెంటనే తేరుకున్న భారత జట్టు రెండు గోల్స్ వేసింది. కాసేపటికే మరో రెండు గోల్స్ చేయడంతో 4-3 స్కోరుతో భారత జట్టు ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత పోలాండ్ మరో గోల్ చేసినప్పటికీ.. మరో రెండు గోల్స్ చేసిన భారత్ 6-4తో ఛాంపియన్గా నిలిచింది.