వెల్లింగ్టన్: న్యూజిలాండ్, ఇండియా మధ్య ఇవాళ జరగాల్సిన తొలి టీ20 రద్దు అయ్యింది. వెల్లింగ్టన్లో ఎడతెరపిలేకుండా వర్షం కురవడం వల్ల మ్యాచ్ను రద్దు చేశారు. రెండు దేశాల మధ్య మూడు టీ20 సిరీస్ ఇవాళ ప్రారంభం కావాల్సి ఉంది. ఇక రెండవ టీ20 మ్యాచ్ ఆదివారం జరగనున్నది. స్కై స్టేడియంలో ఇవాళ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కనీసం టాస్ కూడా నిర్వహించలేకపోయారు.
No play possible in Wellington. T20I 1 abandoned due to rain 🌧️ We move to T20I 2 at @BayOvalOfficial on Sunday! #NZvIND #CricketNation pic.twitter.com/gK81mfiInB
— BLACKCAPS (@BLACKCAPS) November 18, 2022