India vs England | ఐదు టెస్టుల సిరీస్ల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌటైంది. బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ని.. తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే భారత్ బౌలర్లు కుప్పకూల్చారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ మూడు, శార్ధూల్ ఠాకూర్ రెండు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. కెప్టెన్ జో రూట్ (64 పరుగులు) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు.