బ్లూమ్ఫాంటైన్: అండర్-19 ప్రపంచకప్లో యువభారత్ శుభారంభం చేసింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో యంగ్ఇండియా 84 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ బంగ్లాదేశ్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
ఆదర్శ్సింగ్ (76), కెప్టెన్ ఉదయ్ శరణ్ (64) అర్ధశతకాలతో రాణించారు. తెలంగాణ కుర్రాడు అరవెల్లి అవనీశ్రావు (23; ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా ఆడాడు. అరంగేట్రం మ్యాచ్లోనే అవనీశ్ అదుర్స్ అనిపించాడు. బంగ్లా బౌలర్లలో మారూఫ్ 5 వికెట్లు తీశాడు. ఛేదనలో బంగ్లాదేశ్ 167 పరుగులకు ఆలౌటైంది. షిహాబ్ (54) టాప్ స్కోరర్ కాగా.. మన బౌలర్లలో పాండే 4 వికెట్లు తీశాడు. ఆదర్శ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.