గయానా : అండర్ -19 వరల్డ్ కప్లో టీమిండియా తన సత్తా చాటింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీమిండియా 45 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 46.5 ఓవర్లలో 232 పరుగులు చేసి ఆలౌటైంది. సౌతాఫ్రికా టీమ్ 45.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.
భారత బౌలర్ రాజ్ భవా వేసిన బంతికి 45.4 ఓవర్ల వద్ద అఫ్ వ్యూ మయాండ.. ధుల్ చేతికి బంతిని అందించి ఔటయ్యాడు. మయాండ పెవిలియన్ దారి పట్టడంతో భారత్కు విజయం దక్కింది. రాజ్ భవా 6.4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
టీమిండియా జట్టులో సారథి యాష్ ధుల్ 82 పరుగులు చేయగా, తంబే 35, రషీద్ 31, నిషాంత్ 27 పరుగులు చేశారు. ఇక రఘు వన్షి 5, హర్నూర్ సింగ్ 1, రాజ్ భవా 13, దినేశ్ బనా 7, విక్కీ 9 పరుగులు చేశారు.