దుబాయ్: టీ20 వరల్డ్కప్లో ఇండియా జట్టు రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నది. అక్టోబర్లో జరగనున్న ఆ టోర్నీ కోసం టీమిండియా ఎంపిక పూర్తి అయిన విషయం తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. అక్టోబర్ 18వ తేదీన ఇంగ్లండ్తో, 20వ తేదీన ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్లు ఆడనున్నది. ఇక ఆ టోర్నీలో తన తొలి అధికారిక మ్యాచ్ను పాకిస్థాన్తో అక్టోబర్ 24వ తేదీన ఇండియా ఆడనున్న విషయం తెలిసిందే. యూఏఈ, ఒమన్ దేశాలు ఈ సారి టీ20 వరల్డ్కప్కు ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలుత రౌండ్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ఆ తర్వాత సూపర్ 12 స్టేజ్ ప్రారంభం అవుతుంది. నవంబర్ 14వ తేదీన దుబాయ్లో ఫైనల్ మ్యాచ్ జరగనున్నది.