ధర్మశాల: పంజాబ్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 60 రన్స్ తేడాతో నెగ్గింది. దీంట్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) మ్యాచ్ విన్నింగ్ ఆట ఆడాడు. అతను 47 బంతుల్లో 92 రన్స్ చేశాడు. ఇక ఫీల్డింగ్లోనూ చురుగ్గా కనిపించాడు. 242 రన్స్ టార్గెట్తో చేజింగ్కు దిగిన పంజాబ్ క్రమంగా వికెట్లను కోల్పోయింది. అయితే వన్డౌన్ బ్యాటర్ రిలే రూసో ధాటిగా ఆడాడు. అతను 61 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే హాఫ్ సెంచరీ కొట్టిన సమయంలో.. రిలే రూసో సెలబ్రేట్ చేస్తుకున్నాడు. మైదానంలో గన్ సెల్యూట్ ఇస్తున్నట్లు ఫోజు పెట్టి సంబరం జరుపుకున్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్ రూసో ఔటైన తర్వాత ఆర్సీబీ ప్లేయర్ కోహ్లీ ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నాడు. రూసోకు సెండాఫ్ ఇస్తూ కోహ్లీ కూడా గన్ ఫైరింగ్ ఫోజు ఇచ్చాడు. శర్మ బౌలింగ్లో జాక్స్కు క్యాచ్ ఇచ్చి రూసో వెనుదిరిగాడు. 12 మ్యాచ్లు ఆడిన పంజాబ్ జట్టు.. 8 మ్యాచుల్లో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి ఆ జట్టు నిష్క్రమణకు గురైంది.
Virat Kohli’s celebration on Rossouw’s wicket.😂😭♥️ pic.twitter.com/cmwehKyITA
— 𝗶𝘀𝗵𝗶.🏴 (@kohlifangirl178) May 9, 2024