Asian Champions Trophy : ఒలింపిక్స్లో వరుసగా రెండో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు(Inida Hockey Team) జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ(Asian Champions Trophy) తొలి మ్యాచ్లో చైనాను మట్టికరిపించిన బోణీ కొట్టి రోజైనా గడువలేదు.. ‘మెన్ ఇన్ బ్లూ’ జట్టు మరో విజయాన్ని రుచి చూసింది. సోమవారం జరిగిన మ్యాచ్లో జపాన్(Japan)పై టీమిండియా ఘన విజయం సాధించింది.
విశ్వ క్రీడల్లో పతక విజేతగా ఆడుతున్న తొలి టోర్నీలో టీమిండియా పంజా విసురుతోంది. వరుస పెట్టి ప్రత్యర్థులను ఓడిస్తూ వస్తోంది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ ఆరంభ పోరులో 3-0తో చైనాకు చెక్ పెట్టింది. ఇక జపాన్పై కూడా హర్మన్ప్రీత్ సింగ్ (Harmanpreeth Singh) బృందం అదే జోరు కనబరిచింది. అటాకింగ్ గేమ్తో ప్రత్యర్థి ఆటగాళ్ల ఎత్తులను చిత్తు చేసి.. 5-1తో జయభేరి మోగించింది.
Team India gets a second 𝕎 under the belt with a smashing win against Japan.
5 goals scored in the game, a brace from Sukhjeet and a goal each from Abhishek, Sanjay & Uttam Singh.
We face Malaysia next on 11th at 1:15 PM (IST)
Do not forget to tune in to support team India… pic.twitter.com/jNJGv7GDfM
— Hockey India (@TheHockeyIndia) September 9, 2024
తొలి అర్ధ భాగంలోనే జపాన్ గోల్పోస్ట్పై భారత ఆటగాళ్లు దాడిచేసి సఫలం అయ్యారు. ఆఖరి అర్ధ భాగంలో జపాన్ ఎట్టకేలకు ఒక్క గోల్ చేయగలిగింది. అప్పటికే సంపూర్ణ అధిపత్యం కలిగిన భారత్ వరసగా రెండో విజయం నమోదు చేసింది. భారత్ తరఫున సుఖ్జీత్ రెండు, అభిషేక్(మూడో గోల్), సంజయ్(17వ నిమిషం), ఉత్తమ్ సింగ్(54వ నిమిషం)లు తలా ఒక గోల్ సాధించారు. సెప్టెంబర్ 11న జరిగే తదుపరి మ్యాచ్లో మలేషియాతో భారత జట్టు తలపడనుంది.