రాంచీ: రాంచీలో జరుగుతున్న నాలుగవ టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండవ రోజు భోజన విరామ సమయానికి ఇండియా వికెట్ నష్టానికి 34 రన్స్ చేసింది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) 27, శుభ్మన్ గిల్ 4 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఈ సిరీస్లో ఇప్పటికే రెండు సార్లు డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్.. ఇవాళ కూడా మెరుగైన బ్యాటింగ్ను ప్రదర్శించాడు. ఇప్పటికే అతను తన ఇన్నింగ్స్లో 5 బౌండరీలు బాదేశాడు. గిల్తో కలిసి పటిష్టమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం రెండు రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. అండర్సన్ బౌలింగ్లో అతను కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. టెస్టుల్లో అండర్సన్ 697వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ 353 రన్స్కు ఆలౌటైంది.
That’s Lunch on Day 2 of the Ranchi Test! #TeamIndia move to 34/1.
We will be back for the Second Session shortly! ⌛️
Scorecard ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/3aQLkIpZ4K
— BCCI (@BCCI) February 24, 2024