World Athletics Championships : బుడాపెస్ట్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్(World Athletics Championships)లో భారత రీలే జట్టు(India Relay Team) సంచలనం సృష్టించింది. ఆసియా కప్ రికార్డును తిరగరాస్తూ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన 4400 పురుషుల రీలే పోటీల్లో జమైకా, బ్రిటన్ జట్లను వెనక్కి నెట్టేసి మరీ భారత్ రెండో స్థానంలో నిలిచింది. మహమ్మద్ అనస్ యహియా(Muhammed Anas Yahiya), అమోజ్ జాకబ్(Amoj Jacob), మహమ్మద్ అజ్మల్ వరియథోడి(Muhammad Ajmal Variyathodi), రాజేశ్ రమేశ్(Rajesh Ramesh)లతో కూడాని బృందం చరత్ర సృష్టించింది.
చిరుతల్లా పరుగెత్తిన వీళ్లు అద్భుతాన్ని ఆవిష్కరించారు. కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలో టార్గెట్ లైన్ దాటారు. అమెరికా రీలే జట్టు 2 నిమిషాల 58.47 సెకన్లలో ఫినిషింగ్ లైన్ దాటింది. భారత రీలే చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు అని చెప్పాలి. ఆసియా కప్లో వీళ్లు మూడు నిమిషాల్లో లక్ష్యాన్ని చేరారు.
What did I just watch?
India competing with USA and Trinidad in Mens Relay!! Wow!!
The Indian men’s 4x400m relay team clocked a new Asian record and progressed to the final at the World Athletics Championships 2023 in Budapest.
Go Champs!! pic.twitter.com/JGrjrzE9HX
— இந்தா வாயின்கோ – Take That (@indhavaainko) August 27, 2023
రీలే పరుగులో భారత జట్టు ప్రదర్శనకు అభిమానులే కాదు తోటి అథ్లెట్లు కూడా ఫిదా అయ్యారు. అమెరికాకు చెందిన జస్టిన్ రాబిన్సన్(Justin Robinson) అయితే తాను నమ్మలేకపోయానని అన్నాడు. ‘ఫైనల్ పోరులో నా శక్తిని ఉపయోగంచాలనే ఆలోచనతో ఉన్నా. కానీ, ఒక్కసారిగా నా వెనకాల ఎవరో వేగంగా పరుగెత్తుకు వస్తున్నారని తెలుసుకున్నా. అతను భారతీయుడనే సంగతి నాకు తెలియదు. వాళ్లు పరుగెత్తడం చూసి నిజంగా విస్తుపోయాను’ అని రాబిన్సన్ తెలిపాడు.