జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్.. మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫుల్ఫామ్లో ఉన్న షెఫాలీ వర్మ (46 బంతుల్లో 64, 8 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ (38 బంతుల్లో 66, 7 ఫోర్లు, 3 సిక్స్లు), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (37) రాణించి ప్రత్యర్థి ఎదుట భారీ స్కోరును నిలిపారు.