Team India : దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన భారత జట్టు(Team India) సొంతగడ్డపై ఇంగ్లండ్ సవాల్కు సిద్దమైంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రపంచటెస్టు చాంపియన్షిప్(WTC 2023-25)లో కీలకమైన ఈ టెస్టు సిరీస్లో భారత్.. సీనియర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara), అజింక్యా రహానే (Ajinkya Rahane)లు లేకుండానే బరిలోకి దిగింది.
ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ లేకుండా టీమిండియా 12 ఏండ్ల తర్వాత ఒక టెస్టు మ్యాచ్ ఆడుతోంది. వెస్టిండీస్ (West Indies)తో 2011లో జరిగిన కోల్కతా టెస్టులో భారత జట్టు విరాట్, పూజారా, రహానే లేకుండానే ఆడింది. దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు వీళ్ల గైర్హాజరీలో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. తొలి రెండు టెస్టులకు కోహ్లీ ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాలతో వైదొలగగా.. పూజారా, రహనేలకు మాత్రం చోటు దక్కలేదు.
పూజారా, అజింక్యా రహానే
విరాట్, కోహ్లీ, రహానే.. వీళ్లు లేని భారత టెస్టు జట్టును ఊహించలేం. ఎందుకంటే.. సుదీర్గ అనుభమున్న ఈ ముగ్గురికి కష్ట సమయంలో ఇన్నింగ్స్ నిర్మించడం, ప్రత్యర్ఙి బౌలర్లను విసిగించడం ఎలాగో బాగా తెలుసు. టీమిండియా వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్కు చేరడంలో ఈ సీనియర్ త్రయం కీలక పాత్ర పోషించారు. అంతేకాదు టెస్టుల్లో రోహిత్ సేన అగ్రస్థానంలో నిలవడంలో ఈ ముగ్గురి వాటాను మరువలేం. ఈ ముగ్గురిలో కోహ్లీ ఫామ్లో ఉండగా.. పూజారా, రహానేలు పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు.
కోహ్లీ, అజింక్యా రహానే
నిరుడు ఓవల్ స్టేడియంలో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా విఫలమైన పూజారా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో దంచికొట్టిన రహానే కూడా ఆస్ట్రేలియాపై ఫైనల్లో భారీ స్కోర్ చేయలేకపోయాడు. ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్న పూజారా.. సౌరాష్ట్ర తరఫున సెంచరీల మోత మోగిస్తున్నాడు. మరోవైపు రహానే మాత్రం వరుసగా రెండు డకౌట్లతో నిరాశ పరిచాడు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టుల్లో కోహ్లీ స్థానంలో చోటు ఆశించిన పూజారాకు సెలెక్టర్లు షాకిస్తూ.. కుర్రాడు రజత్ పాటిదార్(Rajat Patidar)ను ఎంపిక చేశారు. దాంతో, ఇక భారత టెస్టు క్రికెట్లో పూజారా, రహానేల శకం ముగిసినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.