IND vs ENG : రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేసర్ సిరాజ్(Siraj) స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. అశ్విన్ బౌలింగ్లో ఓపెనర్ జాక్ క్రాలే(20) మిడాఫ్లో కొట్టిన బంతిని డౌవ్ చూస్తూ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో, సోక్స్ సేన స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జో రూట్, జానీ బెయిర్స్టో() క్రీజులో ఉన్నారు. 16 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్.. 61/3.
Another for Ashwin as Crawley steps down and Siraj takes a good catch at mid-off #INDvENG
▶️ https://t.co/ScJisUw7M1 pic.twitter.com/eJP8bzJ9sx
— ESPNcricinfo (@ESPNcricinfo) January 25, 2024
టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న స్టోక్స్ నమ్మకాన్ని నిలెబెడుతూ ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే(18), బెన్ డకెట్(35) దంచికొట్టారు. మొదటి వికెట్ కోల్పోయింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ రోహిత్.. అశ్విన్కు బంతి అందించాడు. అశ్విన్ తన రెండో ఓవర్లో డకెట్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ కాసేపటికే జడేజా సూపర్ డెలివరీతో ఓలీ పోప్(1)ను బోల్తా కొట్టించాడు. దాంతో, 58 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ పడింది. ఆ కాసేటికే డేంజరస్ ఓపెనర్ క్రాలేను అశ్విన్ తెలివిగా బుట్టలో వేసుకున్నాడు.