న్యూఢిల్లీ : ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి భారత్ సిద్ధమైంది. తాష్కెంట్ వేదికగా ఈ నెల 30 నుంచి మే 14 వరకు జరిగే టోర్నీ కోసం 13 మందితో కూడిన భారత బాక్సింగ్ బృందం సోమవారం బయల్దేరి వెళ్లింది. ఇందులో 6సార్లు ఆసియా చాంపియన్ శివ థాపాతో పాటు రాష్ట్ర యువ బాక్సర్ హుసాముద్దీన్ పోటీ పడుతున్నారు. మెగాటోర్నీలో స్వర్ణ పతక విజేతకు కోటి 64 లక్షలు, రజతానికి 82 లక్షలు, కాంస్యానికి 41 లక్షలు దక్కనున్నాయి. ఈ టోర్నీలో 104 దేశాల నుంచి 640 మంది బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు.