న్యూఢిల్లీ: జూన్లో ఓవల్ మైదానంలో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(World Test Championship) ఫైనల్లోకి ఇండియా వెళ్లింది. శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించడంతో.. ఇండియాకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
India have qualified for the World Test Championship final!
They'll take on Australia at The Oval for the #WTC23 mace!
More: https://t.co/75Ojgct97X pic.twitter.com/ghOOL4oVZB
— ICC (@ICC) March 13, 2023
క్రైస్ట్చర్చ్లో జరిగిన టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. భారీ టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ఆడిన కివీస్ను కేన్ విలియమ్సన్ ఆదుకున్నాడు. అజేయంగా అతను 121 రన్స్ చేసి చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు. చివరి బంతి వరకు మ్యాచ్ థ్రిల్లింగ్గా సాగింది. ఒకవేళ లంక రెండో టెస్టులో గెలిచినా.. ర్యాంకుల్లో ఎటువంటి మార్పు ఉండబోదని ఐసీసీ పేర్కొన్నది. దీంతో ఇండియా ఫైనల్కు అర్హత సాధించింది.
A New Zealand win has given India the boost 👀#WTC23https://t.co/yUvTBxuwzo
— ICC (@ICC) March 13, 2023
2021లో జరిగిన తొలి టెస్టు చాంపియన్షిప్లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడిన విషయం తెలిసిందే. సౌంతాప్టన్లో జరిగిన ఆ ఫైనల్లో కివీస్ 139 రన్స్ ఛేజ్ చేసింది.