టోక్యో: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్కు తొలిరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల సింగిల్స్ స్వర్ణ విజేత లక్ష్యసేన్తో పాటు స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ అలవోక విజయాలతో ముందంజ వేయగా.. సాయిప్రణీత్కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది.
మహిళల డబుల్స్లో తెలంగాణ షట్లర్ సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీ 21-7, 21-9తో అమినథ్ నబీహ-ఫాతిమా నబాహ ద్వయంపై గెలిచి రెండో రౌండ్లో అడుగుపెట్టింది. పూజ-సంజన జంట కూడా శుభారంభం చేయగా.. గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ ద్వయం మంగళవారం బరిలోకి దిగనుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ 21-12, 21-11తో సోల్బెర్గ్పై.. ప్రణయ్ 21-12, 21-11తో లూకాపై నెగ్గారు.