Team India : వెస్టిండీస్ పర్యటనలో యువ ప్లేయర్లు తిలక్ వర్మ(Tilak Varma), యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నారు. అయితే.. ఈ ఇద్దరు త్వరలో బౌలింగ్లోనూ సత్తా చాటుతారని టీమిండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే(Paras Mhambrey) అన్నాడు. టాపార్డర్లో ఉపయుక్తకర బౌలింగ్ చేయగల వనరులు ఉన్నప్పుడే కెప్టెన్కు వెసులుబాటు కలుగుతుందని మాంబ్రే పేర్కొన్నాడు.
గతంలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), వీరేంద్ర సెహ్వాగ్(Virendra Sehwag), సౌరవ్ గంగూలీ(Sourav Ganguly), యువరాజ్ సింగ్(Yuvraj Singh), సురేశ్ రైనా(Suresh Raina) రూపంలో అవసరమైనప్పుడు బౌలింగ్లోనూ ఓ చేయి వేసిన ప్లేయర్లు భారత జట్టులో ఉండేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. అందుకని భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే యువ ఆటగాళ్లను ఆ దిశగా సన్నద్ధం చేస్తున్నట్లు మాంబ్రే పేర్కొన్నాడు.
యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ
‘తిలక్, యశస్వి అండర్-19(Under-19) స్థాయిలో బౌలింగ్ చేసిన వాళ్లే. వాళ్ల దగ్గర ఆ నైపుణ్యం ఉంది. ఒక దశలో వీళ్లిద్దరూ బౌలింగ్పైన కూడా దృష్టి పెట్టారు. త్వరలోనే వారిద్దరి బౌలింగ్ చూస్తామని ఆశిస్తున్నా. బౌలింగ్ ఆప్షన్లు ఎక్కువ ఉంటే ఏ కెప్టెన్కైనా అది ప్రయోజనకరమే. మ్యాచ్లో కనీసం ఒక్క ఓవర్ వేసినా చాలు’ అని పారస్ పేర్కొన్నాడు. ప్రస్తుత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇలా టాప్ ప్లేయర్లందరూ కేవలం బ్యాటింగ్కే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ల లోటు స్పష్టంగా కనిపిస్తుండటంతో టీమిండియా శిక్షణా సిబ్బంది ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.