IND vs Aus : వన్డే ప్రపంచ కప్లో ప్రధాన మ్యాచ్ల(ODI World Cup)కు ఆతిథ్యం దక్కించుకోలేకపోయిన హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం(Rajiv Gandhi Stadium)లో మరో కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా జట్టు.. టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుండగా.. ఇందులో చివరి మ్యాచ్కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే భారత్లో అడుగుపెట్టనున్న ఆసీస్ జట్టు.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది.
వరల్డ్కప్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత భారత్, ఆసీస్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. నవంబర్ 23న తొలి టీ20కి విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుండగా.. సిరీస్లో చివరిదైన ఐదో టీ20 డిసెంబర్ 3న హైదరాబాద్లో జరుగనుంది. ఈ రెండు సిరీస్లతో పాటు అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ పర్యటనల షెడ్యూల్ ను కూడా బీసీసీఐ వెల్లడించింది.
ఆస్ట్రేలియా, టీమిండియా
వచ్చే ఏడాది ఆరంభంలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు భారత్లో పర్యటించనుండగా.. ఇందులో తొలి టెస్టుకు హైదరాబాద్ వేదిక కానుంది. 2024 జనవరి 25 నుంచి 29 వరకు ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే అత్యధిక ప్రజాదరణ ఉండే ప్రపంచకప్ వంటి ప్రముఖమైన మ్యాచ్లను అహ్మదాబాద్కు కేటాయించిన బీసీసీఐ కార్యదర్శి జై షా(Jai Shah).. అప్రధానమైన ఆటలు ఇతర నరగాలకు కేటాయించాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.